సిరాన్యూస్, చిగురుమామిడి
మృతుని కుటుంబానికి మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా
హుస్నాబాద్ లో బస్సు ప్రమాదం లో మృతి చెందిన మృతుని కుటుంబానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్థిక భరోసాను అందజేశారు. కోహెడ మండలం రామచంద్రాపూర్ గ్రామానికి చెందిన జెరిపోతుల రాములు (దావా రాములు) కుటుంబ సభ్యులకు స్థానిక శాసన సభ్యులు,రాష్ట్ర రవాణా ,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ, దహన సంస్కారాల నిమిత్తం మృతుని భార్య జ్యోతి కి 10,000 రూపాయలు ఆర్థికసాయం స్థానిక నాయకులు గ్రామశాఖ అధ్యక్షుడు, బొబ్బల కనకరెడ్డి, హుస్నాబాద్ యూత్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ బీనవేని రాకేష్ యాదవ్ చేతుల మీదుగా అందజేశారు. అలాగే ఆర్టీసీ యాజమాన్యంతో మాట్లాడి వారికి తగిన న్యాయం చేస్తానని, కాంగ్రెస్ పార్టీ ఎల్లపుడూ వారి కుటుంబానికి అండగా ఉంటుందని, పొన్నం ప్రభాకర్ అమెరికా నుండి తెలియజేశారు.