సిరాన్యూస్, సైదాపూర్
దాసరి పవన్కు సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసీ అందజేత: మంత్రి పొన్నం ప్రభాకర్
సైదాపూర్ గ్రామానికి చెందిన దాసరి పవన్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దాసరి పవన్ది నిరుపేద కుటుంబం కావడంతో చికిత్స చేయించుకునే ఆర్ధిక స్థోమత లేకపోవడంతో సైదాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొంత సుధాకర్ను కలిశారు. ఈ విషయాన్ని రాష్ట్ర రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి దొంత సుధాకర్ తీసుకువెళ్లారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందించి చికిత్సకు అవసరమైన 2.50లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎల్వోసీ మంజూరు చేయించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని, హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్ధిక సహాయాన్ని అందేలా కృషి చేస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రతి కార్యకర్తకు, ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకరావాలని తెలిపారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.