సిరాన్యూస్, సామర్లకోట
శ్రీరామ ధనస్సును దర్శించుకోండి : ప్రధాన అర్చకులు శ్రీను
అయోధ్యలో శ్రీరామ చంద్ర మూర్తికి సమర్పించే శ్రీ రామ ధనస్సు (కోదండం)ను పెద్దాపురం గ్రామంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ అమ్మవారి ఆలయములో భక్తుల సందర్శనార్థం ఏర్పాటు చేసినట్లు కన్యకాపరమేశ్వరి ప్రధాన అర్చకులు శ్రీను తెలిపారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ శ్రీ రామ ధనస్సు 13 కేజీల వెండి, 1కేజీ బంగారముతో తయారు చేయించినట్లు తెలిపారు. ఈనెల 22న ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు దర్శించుకోవడానికి అనుమతి ఉంటుందని తెలిపారు.