గంజాయి స్వాధీనం

సిరా న్యూస్,చింతూరు;
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం మోతుగూడెం పోలీస్ స్టేషన్ వద్ద చింతూరు సిఐ గజేంద్ర కుమార్,ఎస్సై గోపాలరావు వాహనాలు తనిఖీ చేపడుతుండగా 800 కేజీల గంజాయిని పట్టుకోవడం జరిగింది.ఈ గంజాయికి సంబంధించిన వివరాలను చింతూరు ఏఎస్పీ రాహుల్ మీనా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.గంజాయిని తరలిస్తున్నట్టు పోలీసు అధికారులకు సమాచారం రావడంతో మోతుగూడెం పోలీస్ స్టేషన్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు.ఈ సమయంలో అటుగా వస్తున్న ఐచర్ వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 550 కేజీల గంజాయిని గుర్తించారు.ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది.అలాగే ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.మరో ఘటనలో కారులో తరలిస్తున్న 250 కేజీల గంజాయిని పోలీసులు గుర్తించారు.ఈ ఘటనలో ఒకరిని అరెస్టు చేశారు.మరో ఇద్దరు పరారీ లో ఉన్నట్లు తెలిపారు.రెండు వేరు వేరు ఘటనలో పట్టుబడ్డ 800 కేజీల గంజాయి విలువ సుమారు 40 లక్షల రూపాయలు ఉంటుందని ఏఎస్పీ రాహుల్ మీనా తెలిపారు.గంజాయిని పట్టుకున్న చింతూరు సిఐ గజేంద్ర కుమార్,ఎస్సై గోపాలరావు లను ఏఎస్పీ రాహుల్ మీనా అభినందించారు.
======================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *