Postal Strike: గ్రామీణ తపాలా ఉద్యోగుల సమ్మె…

సిరా న్యూస్,జగిత్యాల,
తపాలా శాఖలోని గ్రామీణ డాక్ సేవక్ ల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా నాల్గవ రోజు శుక్రవారం జగిత్యాల హెడ్ పోస్ట్ ఆఫీస్ ముందు వివిధ గ్రామాల ఉద్యోగులుధర్నా నిర్వహించారు. 7వ వేతన సవరణ సంఘం ఇచ్చిన నివేదికలో ఉన్న డిమాండ్ లు అన్ని అమలు చేయాలని కోరారు. ఉద్యోగులకు 8గంటల పని భారం కల్పించి సివిల్ స్టేట్స్ హోదా కల్పించాలనిడిమాండ్ చేశారు. 12,24,36 సర్వీస్ ఉన్న ఉద్యోగులకు ఇంక్రిమెంట్. ఇవ్వాలని డిమాండ్ చేశారు. కమలేశ్ చంద్ర కమిటీ సూచించిన అంశాలు అన్ని యదా విదిగా అమలు చేయాలని కోరారు.కమిటీ నివేదిక ఇచ్చి 7 సంవత్సరాలు గడిచినప్పటికి అమలుకు నోచుకోలేదని అన్నారు. దేశ వ్యాప్తంగా నిరవదిక సమ్మెను ఇంకా ఉదృతం చేస్తామని, న్యాయమైన డిమాండ్లు సాధించేవరకు సమ్మె
విరమంచ బోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు కాలగిరి శ్రీనివాసరెడ్డి, రమపతిరావు, చెంగలి గంగాధర్, రాజేందర్, జ్ఞానేశ్వర్, చాంద్, లక్ష్మారెడ్డి, లక్ష్మణ్, రాజశేఖర్, గణేష్,రాజేశం, కొండయ్య, మాణిక్యం, ప్రసాద్, జహురుద్దీన్, రౌత్ నరసయ్య, బొజ్జ నరసయ్య, ధర్మపురి రమేష్, చిక్రమ్ భీమ్ రావు 100 మందికి పైగా గ్రామీణ తపాలా ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *