సిరాన్యూస్, జైనథ్
రేపు జైనథ్ లో విద్యుత్ సరఫరాలో అంతరాయం
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని భోరజ్ సబ్ స్టేషన్ లో పరిధిలోని గ్రామాలకు శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అదనపు అసిస్టెంట్ ఇంజనీర్ గంగాధర్ ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలో భోరజ్ సబ్ స్టేషన్ లో మరమ్మతుల కోసం ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు సరఫరా నిలిపివేయడం జరుగుతుందని తెలిపారు.ఆయా ఏరియాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని తెలిపారు. ఈఅంతరాయానికి విద్యుత్ వినియోగదారులందరు సహకరించాలని కోరారు.