Prabhakar Reddy:బోయినపల్లి వినోద్ కుమార్‌ను అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలి

సిరా న్యూస్, సైదాపూర్:
బోయినపల్లి వినోద్ కుమార్‌ను అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలి
* రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి

కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్‌ను అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి కోరారు. గురువారం వెన్నంపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న చోటుకు వెళ్లి బోయినపల్లి వినోద్ కుమార్ గెలుపునకు ప్రజలు కృషి చేయాలని కోరారు. అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్ల‌ను అభ్యర్థించారు. పలువురు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ప్రజలకు మోసపూరిత హామీలు ఇస్తూ వాటిని అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు పబ్బం గడుపుతున్నాయని, ఇదివరకి లాగా ఈ రెండు పార్టీలకి ఓట్లు వేసి మోసపోకుండా అభివృద్ధిని చూసి ఓటేయాలని వాళ్లకి ఓట్లు వేస్తే అది వృధా తప్ప అభివృద్ధి శూన్యం అన్నారు. బోయినపల్లి వినోద్ కుమార్ కరీంనగర్ జిల్లాను స్మార్ట్ సిటీ జాబితాలోకి చేర్చారని, రైల్వే లైన్లు, మహిళలకు ప్రసూతి ఆస్పత్రులు, కొండగట్టు దేవాలయానికి 300 ఎకరాలు, తెచ్చిన ఘనత ఒక వినోద్ కుమార్ కే సాధ్యమన్నారు. కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సోమారపు రాజయ్య, వెన్నంపల్లి సింగల్ విండో చైర్మన్ బిల్లా వెంకట్ రెడ్డి, తాజా మాజీ సర్పంచ్ అబ్బిడి పద్మ రవీందర్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ మొలుగూరి చిరంజీవి, కుల సంఘం అధ్యక్షులు సంగాల తిరుపతి, సింగిల్ విండో డైరెక్టర్ మొలుగూరి సంపత్, ఎడ్ల సంజీవ్, సంగాల సమ్మయ్య, కొంపెల్లి వెంకట్ రెడ్డి, తాళ్ళపల్లి శ్రీనివాస్, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *