Prabhakar Reddy: బ‌డీడు పిల్ల‌ల‌ను బ‌డిలో చేర్పించండి: ప్రధానోపాధ్యాయులు ఆర్.ప్రభాకర్ రెడ్డి

సిరాన్యూస్, సైదాపూర్:
బ‌డీడు పిల్ల‌ల‌ను బ‌డిలో చేర్పించండి: ప్రధానోపాధ్యాయులు ఆర్.ప్రభాకర్ రెడ్డి
* ఉమ్మడి వెన్నంపల్లి గ్రామాలలో బడిబాట కార్యక్రమం

బ‌డీడు పిల్ల‌ల‌ను బ‌డిలో చేర్పించాల‌ని వెన్నంపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు ఆర్.ప్రభాకర్ రెడ్డి అన్నారు. సోమ‌వారం వెన్నంపల్లి, లస్మన్నపల్లి, బూడిదపల్లి గ్రామాల్లో బ‌డిబాట కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈసంద‌ర్బంగా పాఠశాలల ఉపాధ్యాయులు ఒక బృందంగా ఏర్పడి ఆయా గ్రామాలలోని బడి ఈడు పిల్లలందరినీ వెన్నంపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో జాయిన్ చేసుకున్నారు. ఈసంద‌ర్బంగా ప్ర‌ధానోపాధ్యాయులు మాట్లాడుతూ గవర్నమెంట్ పాఠశాలలోనే మెరుగైన విద్య ఉంటుందని, ప్రత్యేకమైన తరగతి గదులు డిజిటల్ విద్యాబోధన ఉంటుందని వారు తెలిపారు. కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *