సిరా న్యూస్, ఆదిలాబాద్:
అర్హులందరికి ఉజ్వల యోజన పథకం
తెల్ల రేషన్ కార్డు కలిగి ఇప్పటీ వరకు గ్యాస్ కనెక్షన్ లేని కుటుంబాలకు ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకంలో భాగంగా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ అందిస్తున్నట్లు అదనపు కలెక్టర్ శ్యామల దేవి తెలిపారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో అర్హులైన 9మంది లబ్దిదారులకు గ్యాస్ కనెక్షన్లు అందించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ… నిరుపేదలందరు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అర్హులైన వారు తమ దెగ్గర్లోని గ్యాస్ ఎజెన్సీలకు వెళ్లి, ఉచిత కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్వో కిరణ్ కుమార్, గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు, లబ్దిదారులు పాల్గొన్నారు.