సిరా న్యూస్, కడెం:
ప్రజాపాలనకు ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవాలి…
ప్రజా పాలనలో ప్రతి ఒక్కరూ తమ దరఖాస్తులు సమర్పించాలని నిర్మల్ జిల్లా డిఆర్డిఓ విజయలక్ష్మి అన్నారు. మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా పాలన దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా తసిల్దార్ రాజేశ్వరితో కలిసి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. అంతరం ఆమె మాట్లాడుతూ… ప్రభుత్వం 6 గ్యారెంటీలను పకడ్బందీగా అమలు చేసేందుకు వీలుగా ఈ దరఖాస్తులు స్వీకరిస్తుందని, దీన్ని ప్రతి ఒక్కరు సద్విని చేసుకోవాలని కోరారు. వారి వెంట ఎంపీపీ అలెగ్జాండర్, స్థానిక సర్పంచ్ కొండాపురం అనూష లక్ష్మణ్, పంచాయతీ సెక్రెటరీ మునురులు హుస్సేన్, గ్రామపంచాయతీ వార్డ్ సభ్యులు, తదితరులు ఉన్నారు.