సిరా న్యూస్,ఏలూరు….
ఏలూరు లో దారుణం జరిగింది. ఏలూరు సత్రంపాడులో ప్రేమించిన యువతి పై కత్తితో యువకుడు దాడి చేసాడు. సంఘటన స్థలంలో యువతి మృతి చెందింది. అనంతరం అదే చాకుతో తన మెడ కోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడా యువకుడు. యువతి ఏలూరు ఎంఆర్సి కాలనీకి చెందిన రత్న గ్రేస్ (27) గా గుర్తించారు. యువకుడు ముసునూరు గ్రామానికి చెందిన ఏసురత్నంగా గుర్తించారు. పదవ తరగతి నుండి ఏసురత్నం ప్రేమ పేరుతో తమ కూతురిని వేధిస్తున్నాడన్న రత్న గ్రేస్ తల్లి ఆరోపించింది. మరణించిన యువతి రత్న గ్రేస్ కు మూడు రోజుల క్రితం నిశ్చితార్థం జరిగింది. మాట్లాడాలని పిలిచిన యువకుడు ఏసురత్నం దారుణానికి పాల్పడ్డాడు. పెద్దలకు చెప్పకుండా పెళ్లి చేసుకుందామని యువతి పై ఒత్తిడి చేసినట్లు సమాచారం. మృతురాలు ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పని చేస్తుంది.
==============