Prasannajaneya: ఘ‌నంగా శ్రీ ప్రసన్నాంజనేయ శోభయాత్ర

సిరా న్యూస్, సైదాపూర్
ఘ‌నంగా శ్రీ ప్రసన్నాంజనేయ శోభయాత్ర
సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో సోమ‌వారం నుండి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఊరేగింపు ఉత్సవాలు ప్రారంభ‌మ‌య్యాయి. వాడ వాడలా ఊరేగింపు వెళ్ళిన స్వామి వారికి గ్రామ ప్రజలు పూలు, పండ్లు .కొబ్బరికాయలతో గడప గడపకు స్వాగతం చెప్తూ స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈకార్యక్రమం లో మండల ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ బిల్లా వెంకట్ రెడ్డి,తాజా మాజీ సర్పంచ్ అబ్బిడి పద్మ రవీందర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి పోరెడ్డి నరేందర్ రెడ్డి, కంది ప్రసాద్ రెడ్డి, సందుపంట్ల రవీందర్ రెడ్డి, పేరాల రవీందర్, గ్రామస్థులు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *