Prashanth Jeevan Patil: ఇంటివద్దే నీటిని సరఫరా చేయాలి : ప్రత్యేక అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్

సిరాన్యూస్‌,ఆదిలాబాద్‌
ఇంటివద్దే నీటిని సరఫరా చేయాలి : ప్రత్యేక అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్
తాగు నీటి సరఫరా పై కార్యాచరణ రూపకల్పన
రానున్న రెండు నెలల్లో పక్కా ప్రణాళికతో తాగునీటి సరఫరా

గ్రామాలలోని ప్రజలు బావి దగ్గర కు రాకుండా వారి ఇంటివద్దే నీటిని సరఫరా చేయాలని ప్రత్యేక అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు తాగునీటి పర్యవేక్షణ అధికారిగా, ప్రత్యేక కార్యదర్శిగా ప్రశాంత్ జీవన్ పాటిల్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. గురువారం ఆదిలాబాద్‌ కు వ‌చ్చిన‌ ప్రత్యేక అధికారికి జిల్లా పాలనాధికారి రాజర్షి షా, ఐటిడిఏ పిఓ ఖుష్బూ గుప్తా పూల మొక్క అందించి స్వాగతం ప‌లికారు. అనంత‌రం జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరం లో తాగునీటి సరఫరా పై సంబంధిత అధికారులతో ప్రత్యేక అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ జిల్లా పాలనాదికారి రాజర్షి షా, ఐటిడిఏ పిఓ ఖుష్బూ గుప్తా , ట్రైనీ కలెక్టర్ వికాస్ మహతో, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మండలాల వారిగా నియమించిన ప్రత్యేక అధికారులు రోజూ ఫీల్డ్ లో ఉండి పర్యవేక్షించాలని, హబిటేషన్ వారిగా రోజుకు 4,5 జి పి లను పరిశీలించి నీటి సమస్య కు గల కారణాలను తెలుసుకొని నివేదిక తయారుచేసి జిల్లా పాలనాధికారి దృష్టికి తీసుకువెళ్లి తక్షణమే పరిష్కరించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మూడు రోజుల కొకసారి నీటి సరఫరా అవుతున్న హాబిటేషన్ ల వివరాలు సమర్పించాలని ఆన్నారు. ముఖ్యంగా నీటి సమస్య ఎక్కువగా ఉన్నచోట ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాలని, అదిలాబాద్ రూరల్, తాంసి, తలమడుగు, ఇంద్రవెల్లి, బోథ్, బజార్ హత్నూర్, తదితర మండలాల్లో సమస్య ఎక్కువగా ఉన్నచోట ప్రత్యేక శ్రద్ద వహించాల‌న్నారు. పంచాయ‌తీ అధికారి,ఎంపిడివో, ఎంపి ఓ, పంచాయితి కార్యదర్శి ప్రతీ రోజు ఫీల్డ్ లో ఉండి ప్రతి రోజు అక్కడి నీటి సమస్య ను గుర్తించి డైరీ లో వ్రాయాలని, బోర్ వెల్స్, మిషన్ భగీరథ నీరు, ఇంట్రా, పైప్ లైన్, సంబందించి రిపేర్ వర్క్స్, మేజర్ ప్రాబ్లమ్స్ తదితర అంశాలపై అంచనాల ప్రతిపాదనలను సోమవారం లోగా పంపాలని, గ్రామాల్లో ప్రజలు ఎవరు కూడా బావి దగ్గరకు వెళ్లి నీరు తీసుకోకూడదని ట్యాంకర్ల ద్వారా ఇంటింటికి వెళ్లి నీటిని సరఫరా చేయాలని పేర్కొన్నారు.ఈ సమీక్ష లో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *