సిరా న్యూస్;
ప్రవాస భారతీయుల దినోత్సవం భారతదేశ అభివృద్ధికి విదేశీ భారతీయ వర్గాల సహకారాన్ని గుర్తించడానికి భారతదేశపు రిపబ్లిక్ ద్వారా జనవరి 9 న ఏటా జరిగే వేడుక రోజు. జనవరి 9, 1915 న దక్షిణాఫ్రికా నుంచి మహాత్మా గాంధీ తిరిగి ముంబై కి తిరిగి వచ్చిన సందర్భంగా ప్రవాస భారతీయుల దినోత్సవము జరుపుకొనబడుతున్నది.
2003 లో స్థాపించబడి, ఇది భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ మరియు ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమాఖ్య , భారత పరిశ్రమల సమాఖ్య, నార్త్ ఈస్టర్న్ రీజియన్ యొక్క అభివృద్ధి మంత్రిత్వ శాఖ చేత స్పాన్సర్ చేయబడింది. ఒక వేడుక కార్యక్రమం ఒక భారతీయ నగరంలో ప్రతి సంవత్సరం 7-9 జనవరి న జరుగుతుంది: ఇండియన్ ప్రవాసల సంబంధించిన సమస్యల నివరణ మరియు ప్రవాసీ భారతీయ సన్మాన పురస్కారలు అందించబడుతున్నాయి.
2013లో 11 వ ప్రవాస భారతీయుల దినోత్సవము 7-9 జనవరి కొచ్చిలో జరిగింది . మారిషస్ అధ్యక్షుడు, రాజ్కేశ్వూర్ పుర్రీగ్ అధికారిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వ్యవహరించాడు.
2014 లో ప్రవాస భారతీయుల దినోత్సవము న్యూఢిల్లీలో జరిగింది, 51 దేశాల నుండి 1,500 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డులను ఇచ్చారు.
12వ ప్రవాస భారతీయుల దినోత్సవము 2014 జనవరి 7-9 న న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగింది.
13వ ప్రవాస భారతీయుల దినోత్సవము గుజరాత్లోని గాంధీనగర్లోని మహాత్మా మందిర్ వద్ద జనవరి 7-9, 2015 న జరిగింది.
14వ ప్రవాస భారతీయుల దినోత్సవము 2016 7-9 జనవరిలో న్యూఢిల్లీలో జరిగింది.
15వ ప్రవాస భారతీయుల దినోత్సవము 2017 7-9 జనవరిలో కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది.
ప్రాంతీయ ప్రవాస భారతీయుల దినోత్సవము 2018 6-7 జనవరి 6-8 న సింగపూర్, మరీనా బే సాండ్స్లో జరిగింది.