Praveen Yadav:యాదవులకు సముచిత స్థానం కల్పించాలి

సిరాన్యూస్‌,చిగురుమామిడి
యాదవులకు సముచిత స్థానం కల్పించాలి
* యువ యాదవ నాయకుడు కత్తుల ప్రవీణ్ యాదవ్
తెలంగాణ రాష్ట్రంలో 50,లక్షల మంది ఉన్న యాదవ సామాజిక వర్గానికి సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో సముచిత స్థానం కల్పించాలని చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామ యువ నాయకుడు కత్తుల ప్రవీణ్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు గా మాత్రమే యాదవులను వాడుకున్నారే తప్ప రాజ్యంలో వాటా ఇవ్వలేదని దుయ్యబడ్డారు. ప్రస్తుత మంత్రివర్గంలో మంత్రి పదవి, ప్రభుత్వ సలహాదారు, యాదవులకు రెండు లోక్ సభ స్థానాలు, రెండు ఎమ్మెల్సీ స్థానాలు, ఆరు కార్పొరేషన్ చైర్మన్ పదవులు కేటాయించాలని డిమాండ్ చేశారు.ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన 37 కార్పొరేషన్ పదవుల్లో ఒక్క యాదవుడికి చోటు కల్పించకపోవడం దారుణమన్నారు. అగ్రకులాలకు సముచిత స్థానం కల్పిస్తున్నారని విమర్శించారు. 20శాతం ఉన్న ఎస్సీలకు ఒక పదవి కేటాయించడం ఎక్కడి సామాజిక న్యాయమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.యాదవ, బడుగు బలహీన వర్గాలకు రాజ్యంలో వారి జనాభాకు తగ్గ స్థానం కల్పించకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *