Premasanga Reddy: కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నాయకులు

సిరాన్యూస్‌, ఓదెల
కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నాయకులు
పార్టీలోకి ఆహ్వానించిన మండల అధ్యక్షులు మూల ప్రేమసాంగ రెడ్డి

ఓదెల మండల కేంద్రంలోని బీఆర్ఎస్ నాయకులు, ఓదెల గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మంద కొమురయ్య మార్కా రవికుమార్‌లు గురువారం కాంగ్రెస్‌లో చేరారు. వీరికి కాంగ్రెస్ పార్టీ ఓదెల మండల అధ్యక్షులు మూల ప్రేమసాంగ రెడ్డి కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈసంద‌ర్బంగా మండల అధ్యక్షులు మూల ప్రేమసాంగ రెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు నాయకత్వంలో పెద్దపల్లి నియోజకవర్గ వర్గం మరింత అభివృద్ధి చెందుతుందని, ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందుతాయని పార్టీలో చేరుతున్నామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో ఓదెల మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్. మాజీ ఎంపీటీసీ బోడకుంట శంకర్, చీకట్ల మొండయ్య, బండారి కుమారస్వామి. పచ్చిమట్ల శ్రీనివాస్, గడిగొప్పుల సంతోష్ . చెరుకు మహేష్. కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *