Premender: సమాచార హక్కు చట్టం బోర్డులను ఏర్పాటు చేయాలి

సిరా న్యూస్, త‌ల‌మ‌డుగు
సమాచార హక్కు చట్టం బోర్డులను ఏర్పాటు చేయాలి
* సమాచార హక్కు చట్టం 2005 తలమడుగు మండల అధ్యక్షుడు ప్రేమెందర్
మండల స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం బోర్డులను ఏర్పాటు చేయాల‌ని సామాజిక కార్యకర్త, సమాచార హక్కు చట్టం 2005 తలమడుగు మండల అధ్యక్షుడు ప్రేమెందర్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా త‌ల‌మ‌డ‌గు ఎంపిడిఓ ఆఫీస్ లో సమాచార బోర్డులను ఏర్పాటు చెయ్యాలని ఎంపిడిఓ కు వినతి పత్రం అంద‌జేశారు.ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం 2005 మండల అధ్యక్షుడు గొంటిముక్కుల ప్రేమెందర్ మాట్లాడుతూ సమాచార హక్కు గురించి తెలుసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత రాజ్యాంగ బద్ధమైన సమాచార హక్కు చట్టం ను మండల గ్రామ స్థాయి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాల‌న్నారు. సమాచార హక్కు చట్టం ప్రకారం పూర్తి సమాచారం తో సమాచార హక్కు చట్టం బోర్డులను ఏర్పాటు చేయాల‌ని,ప్రజలకు చట్టం మీద అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *