లేచి కూర్చున్న మహిళ
అమలాపురంలో వింత ఘటన
సిరా న్యూస్,అమలాపురం;
అంబెడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం జనుపల్లి లో వింత ఘటన జరిగింది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జనుపల్లి మన్నా కాలానికి చెందిన సత్యవేణి (59)ని ఒక ప్రవేటు ఆసుపత్రిలో చేర్చి వెంటిలేటర్ పై చికిత్స అందించారు. ఆమె పరిస్థితి కష్టం అని వైద్యులు తేల్చిచెప్పారు. విదేశాల్లో ఉన్న కొడుకు వచ్చేవరకు ఇంటి వద్ద ఆక్సిజన్ పై ఉంచారు. కొడుకు వచ్చిన తర్వాత అంత్యక్రియలు చేసేద్దామని ఏర్పాట్లు చేసి ఆక్సిజన్ తీసివేసారు. ఆక్సిజన్ తీసేసిన తర్వాత మహిళ లేచి కూర్చుంది. నాలుగు రోజులుగా చలనం లేకుండా ఉన్న మహిళ ఒక్కసారిగా లేచి కూర్చోవడంతో స్థానికులు బంధువులు ఆశ్చర్యాన్ని గురైయారు. ఆమెను హుటాహుటిన ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి బాగానే ఉందని, ఏ క్షణం ఎలా మారుతుందో తెలియదు అబ్జర్వేషన్ లో ఉంచాలంటున్నారు వైద్యులు.