బంద్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రతిష్టమైన భద్రత ఏర్పాట్లు.

ప్రతి ప్రధాన సెంటర్ లలో పహారా కాస్తున్న పోలీసులు
 సిరా న్యూస్,తిరుపతి;
భారత్ బంద్ నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమై పటిష్ఠమైన బద్రతా ఏర్పాట్లను చేపట్టింది. సబడివిజినల్ అధికారుల పర్యవేక్షనలో బందోబస్తు కొనసాగుతుంది. ఏక్కడ కూడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు లేకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.
బుధవారం ఉదయం నుండే పోలీసులు బస్టాండ్, రైల్వే స్టేషన్, ప్రధాన సెంటర్ లలో పికెట్స్ లను ఏర్పాటు చేసుకొని ప్రజా దినచర్యలో ఆటంకం కలగకుండా పహారా కాస్తున్నారు. ఎమర్జెన్సీ సర్వీస్ వాహనాలకు ఎలాంటి ఆటంకాలు కలవకుండా ఏర్పాట్లు చేశారు. ఎదైనా అత్యవసర పరిస్తితి వచ్చినప్పుడు పోలీస్ డైల్ 100 కి సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *