సిరా న్యూస్,శ్రీశైలం;
నంద్యాల జిల్లా శ్రీశైలంలో పౌరోహిత్యం చేసే ఆదోనికి చెందిన మహేశ్ (24) సంవత్సరాలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు స్థానిక లింగాయత్ సత్రంలోని రూమ్ నెంబర్ 13లో ఉరివేసుకొని మహేష్ ఆత్మహత్య చేసుకోగా ఆత్మహత్య చేసుకున్న మహేష్ స్థానికంగా పౌరోహిత్యం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు ఈరోజు ఉదయం నుండి రూమ్ లో నుండి బయటకు రాకపోవడంతో సత్రం నిర్వాహకులు శ్రీశైలం పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు తలుపులు తెరిచే చూడగా అప్పటికే మహేష్ ఉరివేసుకుని వికటజీవిల వున్నాడు ఆత్మహత్య చేసుకున్న మహేష్ మృతదేహాన్ని కిందకు దించి మహేష్ కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందజేశారు ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకొని శ్రీశైలం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సివుంది మృతి చెందిన మహేష్ స్థానికంగా పౌరోహిత్యం చేస్తూ స్థానికులు,భక్తులతో అందరితో మంచిగా మెలగడంతో మహేష్ ఆత్మహత్య చేసుకుని మృతి చెందడంపై పలువురు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు శ్రీశైలం వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు పై దర్యాప్తు చేస్తున్నారు