సిరా న్యూస్,సంగారెడ్డి;
పటాన్ చెర్ లో ప్రధాని మోడీ వర్చువల్ గా పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేసారు. జాతీయ రహదారి 65 లోని పుణే – హైదరాబాద్ రహదారిలో సంగారెడ్డి X రోడ్ నుంచి మదీనాగూడ మధ్యన 31 కి.మీ.ల 6 లేన్ హైవే విస్తరణ 1,298 కోట్లు, జాతీయ రహదారి -765డిలో 399 కోట్లతో, మెదక్ – ఎల్లారెడ్డి మధ్యన 2 లైన్ హైవే విస్తరణ, జాతీయ రహదారి -765Dలో 500 కోట్లతో ఏల్లారెడ్డి – రుద్రూర్ మధ్యన 2 లైన్ హైవే విస్తరణ పనులు, జాతికి అంకితం చేసిన ప్రాజెక్టులు (బి) పారాదీప్ – హైదరాబాద్ గ్యాస్ పైప్ లైన్ 3,338 కోట్లు, ఎన్హెచ్ 161 లోని కంది – రామసానిపల్లె సెక్షన్ లో 4 వరుసల జాతీయ రహదారి 1,409 కోట్లు, ఎన్హెచ్ -167 లోని మిర్యాలగూడ – కోదాడ సెక్షన్ 2 వరుసల జాతీయ రహదారి విస్తరణ
323 కోట్లు, హైదరాబాద్, సికింద్రాబాద్ల్లో 103 కి.మీ.ల పొడవున చేపట్టిన ఎంఎంటీఎస్ ఫేజ్ – II ప్రాజెక్ట్ 1,165 కోట్లు, ఘట్ కేసర్ – లింగంపల్లి మధ్యన కొత్త ఎంఎంటిఎస్ రైలు ప్రారంభం చేసారు.
======================