సిరా న్యూస్;
ఎర్రకోటపై స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించిన ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసారు.
అనంతరం ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.భారత ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకం. 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా అభివృద్ధి పథంలో వెళ్తున్నాం. 40 కోట్ల మంది స్వాతంత్య్రాన్ని సాధిస్తే ఇప్పుడు 140 కోట్ల మంది ఎంతైనా సాధించవచ్చు. గొప్ప లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.