కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల
సిరా న్యూస్,మచిలీపట్నం;
మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమ స్యలను ప్రధానిమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసికెళ్లి పరిష్కరిస్తామని, జీవ నోపాధి మెరుగుపర్చడానికి కృషి చేస్తా మని కేంద్ర మత్స్యకార, పశు సంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తంరూపాలా హామీ ఇచ్చారు.సాగర్ పరిక్రమ – ప్రో గ్రాం ఫేజ్ – 10 లో భాగంగా కృష్ణా జిల్లా మచిలీపట్నం గిలకలదిండి ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న హార్బర్ నిర్మాణ ప్రాంతానికి ఆయన చేరుకొన్నారు. దశలవారీగాఅభివృద్ధి చెందుతున్న ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి పురోగతిని ఆయన పరిశీలించారు. అయనకు స్థానిక మత్స్య కారులు ఘన స్వాగతం పలికారు. హార్బర్ ప్రాంగణ ఆవరణలో మత్స్యకా రులతో కేంద్ర మంత్రి ముఖాముఖినిర్వహించారు.తొలుత ఆయన పిఎమ్ఎమ్ఎస్వై పథకం కింద ఇద్దరు ఎస్సీ లబ్దిదారులకు, ఒక ఎస్టీ లబ్ధిదా రునికి పంపిణీ చేయబడిన 4 చక్రాల మూడు నంబర్లు (2 లైవ్ ఫిష్ ట్రాన్స్ పోర్ట్ వెహికల్స్ , ఒక ఇన్సులేటెడ్వెహికల్) పిఎమ్ఎమ్ఎస్వై పథకం కింద 3-వీలర్ (అనుకూలీకరించిన ఆటో) ఒకటి లబ్ధిదారునికి పంపిణీ చేశారు.అలాగే పిఎమ్ఎమ్ఎస్వై కింద ఫిష్ ఆంధ్రా మినీ ఫిష్ రిటైల్ అవుట్లె ట్లను గ్రౌండింగ్ చేయడానికిమంజూరు ప్రక్రియలు నలుగురు లబ్ధిదారులకు కేంద్ర మంత్రి పంపిణీ చేశారు. అనంత రం కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా మాట్లాడుతూ.. మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి గల అవకాశాలను అంచనావేసేందుకు తమిళనాడు, గోవా, మహారాష్ట్రలో పర్యటించి 2024 జనవరి 1 వ తేదీ ,నుండి 6వ తేదీ వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో,ఎం ఎం ఎస్ వై స్కీమ్లపై ప్రచారంతో పాటు రైతుల మాదిరిగానే మత్స్యకారులకు కూడాకిసాన్ క్రెడిట్ కార్డులు అందిస్తున్నట్లు తెలిపారు.