సిరాన్యూస్, బోథ్
వీరుల త్యాగాలను మరవద్దు: ప్రధానోపాధ్యాయురాలు ఏ శైలజ
* విజ్ఞాన్ పాఠశాలలో తిలక్, ఆజాద్ల జయంతి వేడుకలు
దేశం కోసం ప్రాణం త్యాగం చేసిన భారతదేశ ముద్దుబిడ్డలను ఎప్పటికీ మరువ వద్దని, వారి త్యాగాల ఫలితమే ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తున్నామని విజ్ఞాన్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఏ శైలజ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని పాఠశాలలో బాలగంగాధర్ తిలక్ చంద్రశేఖర్ ఆజాద్ ల జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు దేశం కోసం చేసిన పోరాటాలను, ప్రాణ త్యాగాలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు దేశం కోసం ఐక్యతగా ముందుకు సాగాలని సూచించారు .ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.