సిరాన్యూస్,బోథ్
కుటుంబీకుల పేరుతో ఒక మొక్కను నాటండి : ప్రిన్సిపాల్ కిషోర్ కుమార్
ప్రతి ఒక్కరూ తమ కుటుంబీకుల జ్ఞాపకార్థం నాటాలని పాఠశాల ప్రిన్సిపాల్ కిషోర్ కుమార్ పేర్కొన్నారు. ప్రపంచ ప్రకృతి దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్ నాగభూషణం మెమోరియల్ హై స్కూల్ జిల్లా పరిషత్ పాఠశాలల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆర్ టి వి ప్రసాద్, రాజేందర్ గౌడ్, కిషోర్ కుమార్ లతోపాటు ఆయా పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు