సిరాన్యూస్, జైనథ్
విద్యార్థుల ప్రగతికి కారకుడు ఉపాధ్యాయుడు: ప్రధానోపాధ్యాయులు కొనిగెల నారాయణ
* బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు ఘన సన్మానం
విద్యార్థుల ప్రగతికి కారకుడు ఉపాధ్యాయుడుని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొనిగెల నారాయణ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని కాన్పమేడిగూడ రోడ్ ప్రాథమిక పాఠశాలలో సుదీర్ఘ కాలం విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేసి బదిలీ పై వెళ్ళిన ఉపాధ్యాయులు బండొల్ల భవానిఆనంద్, పెంటపర్తి ఊశన్న, కన్నల భూమయ్య లను విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొనిగెల నారాయణ మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాలు కాన్పమేడిగూడ రోడ్ క్రమశిక్షణ బద్ధంగా విధులు నిర్వహించిన బండొల్ల భవాని ఆనంద్, పెంటపర్తి ఊశన్న, కన్నల భూమయ్య ఉపాధ్యాయులు అభినందనీయూలని అన్నారు. విద్యార్థులకు ఆట పాటలతో బోధన ఎంతో రసవత్తరంగా బోధించే వారని అన్నారు. పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధే ధ్యేయంగా పని చేశారని అన్నారు. ఇలాంటి ఉపాధ్యాయులు మా పాఠశాల నుండి బదిలీపై వేళ్ళడం బాధగా ఉందని అన్నారు. ఉద్యోగికి బదిలీ సహజ పక్రియ అని అన్నారు. బదిలీపై వేళ్తున్న పాఠశాలను మరింత అభివృద్ధికి కృషి చేయాలని ఆశిస్తూనాని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యవాన్ చిక్టే, పాఠశాల యాజమాన్య కమిటీ మాజీ చైర్మన్ పోలవేణి అడేల్లు, ఉపాధ్యాయురాలు జ్యోతి, వసుధ, దేవిదాస్, ప్రకాష్, లెనిన్ బాబు, గ్రామస్తులు కూంచేల శంకర్, మూక్తేర్ హుసేన్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.