Principal Padma: మత్తు పదార్థాలను నిర్మూలిద్దాం:  ప్రధానోపాధ్యాయులు పద్మ

సిరాన్యూస్‌, ఓదెల
మత్తు పదార్థాలను నిర్మూలిద్దాం:  ప్రధానోపాధ్యాయులు పద్మ

మత్తు పదార్థాలు లేని సమాజాన్ని నిర్మిద్దామ‌ని ప్రధానోపాధ్యాయులు పద్మ అన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో ప్రధాన వీధుల గుండా జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు పద్మ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈసంద‌ర్బంగా ఆమె మాట్లాడుతూ మత్తు పదార్థాలను నిర్మూలిద్దామ‌న్నారు. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని అన్నారు. ఈకార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్వో యాకన్న హాజ‌ర‌య్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి యువతకు పిలుపునిచ్చారు. డ్రగ్స్ లేని సమాజాన్ని నిర్మిద్దాం అన్నారు .కార్యక్రమంలో స్కూలు ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *