Principal Shailaja : ఓటు హక్కు ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు : పాఠశాల ప్రిన్సిపాల్ శైలజ

సిరాన్యూస్‌, బోథ్
ఓటు హక్కు ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు : పాఠశాల ప్రిన్సిపాల్ శైలజ
* విజ్ఞాన్ పాఠశాలలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై అవ‌గాహ‌న

ఓటు హక్కు ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని పాఠశాల ప్రిన్సిపాల్ శైలజ అన్నారు. శ‌నివారం ఆదిలాబాద్ జిల్లా బోథ్‌ విజ్ఞాన్ పాఠశాలలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై అవ‌గాహ‌న క‌ల్పించారు. ఈసంద‌ర్బంగా ఆమె మాట్లాడుతూ భారతదేశం ప్రజాస్వామ్య దేశమ‌ని, దేశములో ఎన్నికలు అనేవి అత్యంత ప్రాముఖ్యాన్ని కలిగి ఒక మంచి నాయకుణ్ణి ఎన్నుకొనే అవకాశం ఉంటుంద‌ని తెలిపారు. ఇందులో భాగంగానే విజ్ఞాన్ పాఠశాలలో ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగం చట్ట సభల నేపథ్యం తెలిసేలా విజ్ఞాన్ పాఠశాల‌ విద్యార్థులతో ఎన్నికలు నిర్వహించామ‌ని తెలిపారు.ప్రజా జీవితంలో సమాజంలో ఓటు హక్కు వినియోగం చట్ట సభల ఎంపిక చాలా ముఖ్యమైన విషయం అని, విద్యావంతులైన‌ యువత మున్ముందు రాజకీయాల్లో రాణీస్తే అన్ని రంగాల్లో అనేక మార్పులు చేర్పులు జరుగుతాయని అన్నారు.వారితో పాటు పాఠశాల కరస్పాండెంట్ బద్దం పురుషోత్తం రెడ్డి ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *