సీనియర్ సిటిజన్స్ రక్షణకు ప్రాధాన్యమిస్తాం

జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

 సిరా న్యూస్,జగిత్యాల;
:సీనియర్ సిటిజన్స్ రక్షణకు మరింత ప్రాధాన్యమిస్తామని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. సోమవారం తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా ప్రతినిధులు 2024 నూతన సంవత్సరం సందర్భంగా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ కు పుష్పగుచ్ఛం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తమ అస్సోసియేషన్ తరపున తెలిపారు.సీనియర్ సిటిజన్స్ చట్టం అవగాహన దర్శినులను ఎస్పీ ఆవిష్కరించారు. .ఆనంతరం ఎస్పీ మాట్లాడుతూ వయోవృద్ధుల సంరక్షణ బాధ్యత పిల్లలదేనని,
వేధింపులకు,నిరాదరణకు గురిచేసిన వారు వయోవృద్ధుల పోషణ,సంరక్షణ చట్టం ప్రకారం శిక్షార్హులే నన్నారు.సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కార్యవర్గ ప్రతినిధులు సీనియర్ సిటిజన్లపై వేధింపులు, రక్షణ సమస్యలు వచ్చినా ఫిర్యాదు చేస్తే తగు చర్యలు పోలీసు శాఖ పరంగా వెంటనే తీసుకుంటామన్నారు. .ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్,ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం,ఉపాధ్యక్షులు పి.సి.హన్మంత రెడ్డి,
ఎం.డి.యాకూబ్,కోశాధికారి వెలుముల ప్రకాష్, ఆర్గనైజింగ్ కార్యదర్శి పూసాల ఆశోక్ రావు, ఎండి.ఎక్బాల్
,నారాయణ,దేవేందర్ ర్రావు,సతీష్ రాజ్,
సత్యనారాయణ ,కొండాపూర్ యాకూబ్,జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *