Prithviraj Goud: కష్టాల్లో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాలి :బీజేపీ మండల అధ్యక్షులు పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్

సిరాన్యూస్‌, భీమదేవరపల్లి
కష్టాల్లో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాలి :బీజేపీ మండల అధ్యక్షులు పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్
* త‌హ‌సీల్దార్‌కు విన‌తి ప‌త్రం అంద‌జేత

కష్టాల్లో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాలని బీజేపీ మండల అధ్యక్షులు పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్ అన్నారు. సోమ‌వారం కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు భీమదేవరపల్లి మండలంలోని రైతంగం ఎదుర్కొంటున్న సమస్యలపై బీజేపీ మండల శాఖ నేతృత్వంలో తహసీల్దార్‌కు విన‌తి పత్రం ఇవ్వడం జరిగింది. ఈసంద‌ర్బంగా బీజేపీ మండల అధ్యక్షులు పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్ మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల పంట నష్టపోయి నటువంటి రైతులకు నష్టపరిహారం అందించాల‌న్నారు. అకాల వర్షాలకు తోడుగా ప్రభుత్వ వ్యవహార శైలి కూడా నిర్లక్ష్య ధోరణితో రైతులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌న్నారు. తాలు తరుగు తేమతో సంబంధం లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఆదేశించినప్పటికీ క్షేత్రస్థాయిలో ఆదేశాలకు అనుగుణంగా జరగకపోవడం బాధాకరమ‌న్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గుండెల్లి సదానందం, బండారి కర్ణాకర్, వేముల ప్రసాద్, అయిత సాయి, దొంగల రాణా, బైరి సదానందం, బొజ్జపురి పృథ్వీ, గద్ద రాజేందర్, సాయి యాదవ్, కాలేరు వికాస్, ముద్దసాని వీరన్న, సోప్పరి నవీన్, మాడ్గుల అజిత్ కుమార్, బోడ రమేష్, బోనగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *