సిరా న్యూస్, భీమదేవరపల్లి
వరంగల్ డిపో, వరంగల్ డిపో 1, హనుమకొండ డిపోలోని ప్రైవేట్ బస్సులు బందుకు పిలుపునిచ్చాయి.. ఈ సందర్బంగా ప్రైవేట్ డ్రైవర్లకు జీతాల పెంపుపై యజమాన్యానికి నెల రోజుల ముందే సమాచారం ఇచ్చిన పట్టించుకోకపోవడంతో బందుకు పిలుపునిచ్చినట్టు తెలిపారు. బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు ఎక్కడికక్కడ రోడ్లపై నిలిచి పోయారు. ఉదయం మోడల్ స్కూల్స్ కి వెళ్లవలసిన పిల్లలు నిరాశతో వెను తిరిగారు. ప్రైవేటు బస్సులు బంద్ కు పిలుపు ఇవ్వడంతో ప్రయాణికులకు కష్టాలు ఎదురవుతున్నాయి. డిపోల తీరుకు ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. ఈనేపథ్యంలో బస్సులు నడిపించాలని ప్రజలు కోరుతున్నారు.