సిరా న్యూస్,ఖమ్మం;
ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి వద్ద ప్రైవేటు ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో ఆకాష్ అన్నాన్ అనే యువకుడికి తీవ్రగాయాలు అయ్యాయి. మరో ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. క్షతగాత్రులని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. బస్ హైదరాబాద్ నుంచి ఒరిస్సా వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఎటువంటి ప్రాణాపాయం జరగక పోయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాద ఘటనపై విచారణ చేస్తున్నారు.