సిరా న్యూస్,ఖమ్మం;
జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు పల్టీకొట్టిన ఘటనలో పదిహేను మందికి గాయాలు అయ్యాయి. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం లోక్యతండ సమీపంలోని హైవేలో ప్రమాదం జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న 31 మంది ప్రయాణికులు. 15 మందికి గాయాలు అయ్యాయి. హైదరాబాద్ నుండి రాజమండ్రి వెళ్తుండగా ఘటన జరిగింది.