సిరాన్యూస్, ఓదెల
ఓదెల మల్లన్నను దర్శించుకున్న సుల్తానాబాద్ కోర్టు జడ్జి ప్రియాంక
శ్రీ క్రొది నామ తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ పురస్కరించుకొని ఓదెల శ్రీ మల్లికార్జున స్వామిని మంగళవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కోర్టు జడ్జి ప్రియాంక కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.ఈసందర్బంగా ఆలయ అధికారులు స్వాగతం పలికి గర్భగుడిలో ప్రత్యేక పూజలు అందించి స్వామి వారి ప్రసాదం అందజేశారు. అనంతరం జడ్జిని శాలువాతో సన్మానించినారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి సదయ్య, ఆలయ సిబ్బంది ముద్దసాని కుమారస్వామి, ప్రధాన అర్చకులు ధూపం వీరభద్రయ్య, ఆలయ కమిటీ చైర్మన్ మేకల మల్లేశం , ధర్మకర్తలు పొత్కపల్లి ఎస్ఐ అశోక్ రెడ్డి తదితరులు ఉన్నారు.