సిరా న్యూస్,నెల్లూరు;
తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలోకి ఎంట్రీ దాదాపు ఖరారు అయ్యింది. వచ్చేవారంఎన్డీఏలోకి టిడిపి చేరుతుందని ప్రచారం జరుగుతోంది. అటు తరువాత చంద్రబాబుఢిల్లీ పయనమవుతారని తెలుస్తోంది. పవన్ సైతం హస్తినబాట పడతారని సమాచారం. ఈనేపథ్యంలో టిడిపి ఎన్డీఏలోకి ఎంట్రీ లాంఛనమేనని తెలుస్తోంది. దీంతోబిజెపిలోని ప్రో టిడిపి నేతలు ఎవరికి వారుగా పావులు కదుపుతున్నారు.గతఎన్నికల్లో టిడిపి ఓటమి తరువాత నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలోకివెళ్లారు. చంద్రబాబు దగ్గరుండి వారిని బిజెపిలోకి పంపించారని ప్రచారంజరిగింది. ఇందులో చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన సీఎం రమేష్, సుజనాచౌదరి ఉన్నారు. బిజెపితో తెలుగుదేశం పార్టీ పొత్తు వ్యవహారం వెనుకప్రధానంగా ఉన్నది వీరిద్దరేనని తెలుస్తోంది.రెండు పార్టీల మధ్య చర్చలు,సీట్ల సర్దుబాటు విషయంలో సైతం వీరే కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం.ఒకవేళ తెలుగుదేశం పార్టీతో బిజెపి పొత్తు కుదరకపోతే బయటకు వచ్చేది కూడా ఈఇద్దరే. అయితే ఎన్డీఏలోకి టిడిపి ఎంట్రీ ఖాయం కావడంతో ఈ ఇద్దరు ఎంపీలుగా
పోటీ చేసేందుకు పావులు కదపడం ప్రారంభించారు.2014 ఎన్నికల్లో ఈ ఇద్దరునేతలు టిడిపిలో కీలకంగా వ్యవహరించారు.
స్వతహాగా పారిశ్రామికవేత్తలు అయినఈ ఇద్దరు టిడిపికి ఆర్థిక వనరులను సమకూర్చారు. రాష్ట్రస్థాయిలో సమన్వయబాధ్యతలు తీసుకున్నారు. ఆ ఎన్నికల్లో టిడిపి గెలుపు పొందడంతో చంద్రబాబుకుఅత్యంత సన్నిహితులుగా మారారు. క్యాబినెట్ మంత్రులకు మించి హోదావెలగబెట్టారు. కొద్ది రోజులకే రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. అయితే గతఎన్నికల్లో బిజెపిని విభేదించిన టిడిపి.. ఘోర పరాజయం చవిచూసింది. దీంతో ఈఇద్దరు చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలను కాపాడేందుకు బిజెపిలో చేరారు అన్నదిఒక ప్రచారం. అందుకు తగ్గట్టుగానే గత నాలుగున్నర సంవత్సరాలుగా వారివ్యవహార శైలి ఉంది. ఇప్పుడు బిజెపితో టిడిపి చేతులు కలపనుండడంతో వీరిఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.
పొత్తులో భాగంగా ఎక్కువ పార్లమెంట్ స్థానాలను బిజెపి కోరుకుంటుంది. అదే జరిగితే బిజెపి ఆశావహులుగా సీఎంరమేష్, సుజనా చౌదరి ఉండడం ఖాయం. వీరిద్దరి విషయంలో చంద్రబాబు సైతంఎటువంటి అడ్డు చెప్పరు. వారు బిజెపిలో ఉన్న టిడిపి ప్రయోజనాలేకోరుకుంటారని చంద్రబాబు కు తెలుసు. అందుకే వారిద్దరు సైతం తమకుశ్రేయస్కరమైన లోక్ సభ స్థానాలను ఎంపిక చేసే పనిలో పడ్డారు. పొత్తులోభాగంగా వారి ఆశించిన సీట్లు బిజెపికి ఇచ్చేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఈ నేపథ్యంలో సీఎం రమేష్ విజయవాడ కానీ, గుంటూరు నుంచి
కానీ పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అటు సీఎం రమేష్ సైతం ఏదోఒక నియోజకవర్గం నుంచి బరిలో దిగాలని చూస్తున్నారు. మొత్తానికైతేబీజేపీలోని బ్రో టిడిపి నేతల్లో మాత్రం పొత్తుల సందడి నెలకొంది. తమకుపదవులు తప్పకుండా వస్తాయని వారు ఆనందంతో ఉన్నారు. మరి ఏం జరుగుతుందోచూడాలి.