సిరాన్యూస్:ఆదిలాబాద్
పట్టభద్రులు ఓటు వినియోగించుకోవాలి : విన్నర్స్ పబ్లికేషన్ ఆథర్ ప్రసన్న హరికృష్ణ
* హరికృష్ణను సన్మానించిన బార్ అసోసియేషన్ సభ్యులు
పట్టభద్రులు తమ అమూల్యమైన ఓటు వినియోగించుకోవాలని, ప్రొఫెసర్, విన్నర్స్ పబ్లికేషన్ ఆథర్ ప్రసన్న హరికృష్ణ అన్నారు. శు క్రవారం ఆదిలాబాద్ జిల్లా కోర్టు ఆవరణలోని బార్ అసోసియేషన్లో న్యాయవాదులతో సమావేశాన్ని నిర్వహించారు. మొదటిసారిగా వచ్చిన ఆయనకు బార్ అసోసియేషన్ సభ్యులు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తను ప్రొఫెసర్ గా పని చేస్తున్నప్పటికీ, నిరుద్యోగుల గళాన్ని వినిపించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. పట్టభద్రుల సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. అలాగే పట్టభద్రులైన న్యాయవాదులందరూ తమ సమస్యల పరిష్కారంలో బాగస్వామ్యులు కావాలని అన్నారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి ఎంబడి సంతోష్, మేకల మధుకర్, సంగెం సుధీర్, గంగారెడ్డి, ప్రతాప్రెడ్డి, అఫ్రోజ్ అహ్మాద్, రాగం ప్రశాంత్ పాల్గొన్నారు.