Promises at the time of election.. ఎన్నికల వేళ ఎడాపెడా హామీలు..

సిరా న్యూస్,హైదరాబాద్;

ఎన్నికల కోసం ఎడాపెడా హామీలు ఇచ్చి.. ఆ తర్వాత వాటిని అమలు చేయాలంటే ఎంతఇబ్బంది అవుతుందో.. ఆర్థికంగా ఎంత ఒత్తిడి ఎదురవుతుందో… కర్నాటక రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024-25 రాష్ట్ర బడ్జెట్‌ కళ్లకు కట్టినట్లువెల్లడి చేస్తోంది. మూడు లక్షల 71 వేల కోట్ల రూపాయల వ్యయంతో కర్నాటకరాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కోసం నిధుల సమీకరణలో భాగంగాదాదాపు లక్షా ఐదు వేల కోట్ల రూపాయలను అప్పుల రూపేణా సమీకరించుకోవాల్సినపరిస్థితి కర్నాటక రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురయ్యింది. అంటే బడ్జెట్‌లో28% మొత్తాన్ని అప్పు చేసి తెచ్చుకోవాల్సి వచ్చింది.కర్నాటక ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల కోసం 2024-25 ఆర్థిక సంవత్సరంలోదాదాపు లక్షా 20 వేల కోట్ల రూపాయలు కేటాయించింది.

ఇందులో లక్షా 5 వేలకోట్ల రూపాయలను అప్పుగా తేవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. దీంతో సంక్షేమపథకాల అమలు ఎంత కష్టతరం కాబోతోందో ఇట్టే అర్థం అవుతోంది. కర్ణాటక రాష్ట్రప్రభుత్వానికి ఇప్పటికే 4 లక్షల 35 వేల కోట్ల రూపాయల అప్పు ఉంది. దీనికికొత్తగా తీసుకు రానున్న అప్పులు అదనం. ఈ ఏడాదికి ఏదో విధంగా అప్పులుతీసుకు రాగలిగినా, వచ్చే సంవత్సరాల్లో ఇది సాధ్యం అవుతుందా అనే ప్రశ్నఉత్పన్నం కాకమానదు.కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరంలో44 వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికివచ్చే సరికి అప్పుగా తెచ్చిన మొత్తం 85 వేల కోట్ల రూపాయలుగా ఉంది.2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను లక్షా 5 వేల కోట్ల రూపాయల అప్పుతీసుకురానున్నారు.
ఇలా ప్రతి ఏటా తీసుకురావాల్సిన అప్పులు పెరిగిపోతుంటే…

అప్పు పుట్టే పరిస్థితి ఉంటుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.గడచినఅసెంబ్లీ ఎన్నికల సందర్భంగా… కర్నాటకలో కాంగ్రెస్‌ పార్టీ ఎడాపెడా హామీలుఇచ్చిందని, తెలంగాణలోనూ ఇదే ఒరవడి కొనసాగించారని, ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ అక్కడ కూడా ఎడాపెడాహామీలు గుప్పించనున్నారనే విస్తృత చర్చ జరుగుతున్న సందర్భంలో.. కర్నాటకరాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. తెలంగాణ అసెంబ్లీఎన్నికల సందర్భంగా ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలుచేయడం మున్ముందు ఇబ్బందికరంగా మారనుందనే చర్చ ఇప్పటికే
మొదలయ్యింది.ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి అయితే.. మరో అడుగు ముందుకు వేసిఎన్నికల హామీలపై కొత్త చర్చకు తెరదీశారు. ఆంధ్రప్రదేశ్‌లో తాను ఇప్పుడుఅమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల కోసం ఏటా దాదాపు 53 వేల కోట్లరూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని.. ఈ నిధులు సమీకరించుకోవాలంటేనేతలప్రాణం.. తోకలోకి వస్తోందని జగన్మోహన్‌రెడ్డి బహిరంగంగానేచెప్పారు.

ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, తెలుగుదేశం అధినేతచంద్రబాబునాయుడు కొత్తగా చెబుతున్న వాగ్దానాలను అమలు చేయాలంటే ఏటా మరో 73వేల కోట్ల రూపాయలు కావాలని, అంటే ఇప్పటికే ఉన్న వాటికి తోడు… కొత్తవిఅమలు చేయడానికి ఏడాదికి మొత్తం లక్షా 26 వేల కోట్ల రూపాయలు కావాలని,వీటిని ఎక్కడి నుంచి తెస్తారని జగన్‌ సూటిగా ప్రశ్నిస్తున్నారు.ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే 7 లక్షల కోట్ల రూపాయలకుపైగా అప్పు ఉన్న నేపథ్యంలో.. జగన్‌ లేవనెత్తుతున్న ప్రశ్న కొత్త చర్చకుదారితీస్తోంది.ఎన్నికల సందర్భంగా ఎడాపెడా హామీలు ఇచ్చుకుంటూ పోతే… వాటిని
అమలు చేయడానికి నిధులు ఎలా ? అప్పులతో ఎంతకాలం నిధులు సమీకరించగలుగుతారు? హామీలు తలకు మించిన భారంగా మారి చివరకు చేతులెత్తేయాల్సిన పరిస్థితిరాదా ? అదే జరిగితే.. సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారిరియాక్షన్‌ ఎలా ఉంటుంది ? దీనికి ముగింపు ఎలా ఉండనుంది ? అనే ప్రశ్నలుఉత్పన్నమవుతున్నాయి. అందుకే కర్ణాటక రాష్ట్ర బడ్జెట్‌లో ప్రతిపాదించిన
అప్పుల సమీకరణ అంశం మిగిలి రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగించేలాఉంది.ఏటేటా చేస్తున్న అప్పుల విషయానికి వస్తే… ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం2023-24 ఆర్థిక సంవత్సరానికి దాదాపు 77 వేల కోట్ల రూపాయల అప్పులు చేయగా,
2024-25 ఆర్థిక సంవత్సరానికి 86 వేల 612 వేల కోట్ల రూపాయల అప్పులుతేవాల్సి ఉంటుందని అంచనా వేశారు. తెలంగాణ ప్రభుత్వం విషయానికి వస్తే2023-24 ఆర్థిక సంవత్సరంలో సుమారు 43 వేల 115 కోట్ల రూపాయల అప్పులుతీసుకురాగా, 2024-25 ఆర్థిక సంవత్సరానికి 64 వేల 525 కోట్ల రూపాయల అప్పుతీసుకురావాల్సి ఉంటుందని అంచనా వేశారు. ఇటు ఆంధ్రప్రదేశ్‌, అటు తెలంగాణరాష్ట్రాలు రెండూ ఇప్పటికే భారీగా పేరుకుపోయిన అప్పులతోసతమతమవుతున్నాయి.రానున్న సంవత్సరాల్లో ఈ అప్పుల భారం పెరిగిపోయి… కొత్తఅప్పులు పుట్టడం రాష్ట్ర ప్రభుత్వాలకు కష్టమవుతుందనే అభిప్రాయం ఉంది.దీనికితోడు కేంద్ర ప్రభుత్వం వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల అనంతరం… ఆర్థికక్రమశిక్షణ కోసం కొత్త నిబంధనలు తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే..
రాష్ట్ర ప్రభుత్వాలకు నిధుల పరంగా ఎదురయ్యే పరిస్థితిని ఊహించుకోవడమేకష్టంగా ఉంటుంది.అందుకే… తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హామీల విషయంలో కనుకరాజకీయ పార్టీలు నేల విడిచి సాము చేస్తే… ఆర్థిక ఇబ్బందులు భరించలేనిస్థాయికి వస్తాయన్నది సుస్పష్టం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *