ప్రజావాణిలో వచ్చిన సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి

ఒకే సమస్య పై పలుమార్లు కలెక్టర్ కార్యాలయానికి వచ్చే ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చేపట్టాలి
జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

సిరా న్యూస్,జయశంకర్ భూపాలపల్లి;

ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.
సోమవారం జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల సమస్యలకు సంబంధించిన 22 దరఖాస్తులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ప్రజల నుండి అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించుటకు సంబంధిత శాఖలకు కలెక్టర్ తెలిపారు.
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యతతో వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. శాఖల వారిగా పెండింగ్ లో ఉన్న సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రజలు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
===================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *