-రెనే హాస్పిటల్ చైర్మన్ ప్రో డాక్టర్ బంగారి స్వామి
-ఉచిత ఐవిఎఫ్ క్యాంపులో లక్కీ డ్రా ద్వారా 10 మంది దంపతులు ఎంపిక
సిరా న్యూస్,కరీంనగర్;
నేడు సమాజంలో ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య సంతానలేమి అని, ఆరోగ్యకరమైన అలవాట్లు, ప్రతి రోజూ కనీస వ్యాయామం చేయడం, సరైన ఆహారపు అలవాట్ల ద్వారా సంతాన సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చని రెనే హాస్పిటల్ చైర్మన్ ప్రో డాక్టర్ బంగారి స్వామి అన్నారు.
శ్రీ లక్ష్మీ మహేశ్వర చారిటబుల్ ట్రస్ట్, రజనీ ఫెర్టిలిటీ సెంటర్ కరీంనగర్ వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ఐవిఎఫ్ క్యాంపు కి సంబంధించిన లక్కీ డ్రా ను శనివారం నిర్వహించారు. ఈ లక్కీ డ్రా కి ముఖ్య అతిధిగా ప్రముఖ యూ ట్యూబ్ సెలిబ్రిటీ మై విలేజ్ షో ఫేం శ్రీమతి గంగవ్వ హాజరై పది మంది దంపతులను ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా రెనే హాస్పిటల్ చైర్మన్ ప్రో డాక్టర్ బంగారి స్వామి మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం తన తల్లి గారైన కీ.శే.బంగారి లక్ష్మీ జ్ఞాపకార్థం చేపట్టే సేవా కార్యక్రమాలలో భాగంగా ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ ఐ వి ఎఫ్ వైద్యురాలు డా.బంగారి రజనీ ప్రియదర్శిని మాట్లాడుతూ పిల్లలు కలగపోవడానికి దంపతులు ఇద్దరి ప్రమేయం ఉంటుందని, దీనికి కేవలం స్త్రీని మాత్రమే బాధ్యురాలిని చేయొద్దని, సరైన వయస్సులో పెళ్లి, సరైన వయస్సులో పిల్లల్ని కనడం ఎంతో అవసరమని అన్నారు. భవిష్యత్ లో ఎలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం తో పాటు ముఖ్యంగా సంతానలేమి సమస్యలకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన శిబిరాలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించే విధంగా కార్యక్రమాలు చేపడుతామని అన్నారు. ఈ సమావేశంలో యూ ట్యూబ్ ఫేం శ్రీమతి గంగవ్వ మాట్లాడుతూ పిల్లలు కాని
దంపతులు ముఖ్యంగా మూఢ నమ్మకాల జోలికి పోకుండా సరైన సమయంలో వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డా రవీంద్రా చారి, జనరల్ మేనేజర్ అరవింద్ రావు లతో పాటు సిబ్బంది మరియు 200 పేషెంట్లు పాల్గొన్నారు.
===============================