సిరా న్యూస్,పరవాడ;
పరవాడ మండలంలో బొగ్గు లారీలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని దీంతో బొగ్గు లారీలతో భారీ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీనిపై జిల్లా ఆర్టీవోకి, పోలీస్ అధికారులకు గతంలో అనేకమార్లు ఫిర్యాదు చేయడం జరిగిందని తాజాగా మరోసారి లంకెలపాలెంలో బొగ్గు లారీ కారణంగా శుక్రవారం భారీ ప్రమాదం జరిగిందని ఇప్పటికైనా బొగ్గు లారీలను ఈ రహదారులకుండా ప్రయాణించకుండా చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు.శనివారం స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ బొగ్గు లారీలు అధిక లోడుతో నిబంధనలకు విరుద్ధంగా భారీ ఎత్తున బొగ్గని రోడ్డుపై వెదజల్లుతూ తీవ్ర కాలుష్యానికి కారణం అవుతున్నాయని దీని వలన ప్రమాదాలు జరుగుతున్నాయని, వాహనాల సమర్ధ్యం చెక్ చేసుకోకుండా అధిక లోడులుతో వెళ్లడం వలన ప్రమాదంలకు కారణం అవ్వుతున్నాయి.అదే మార్గం గుండా ద్విచక్ర వాహనదారులు ఈ మార్గం గుండా ప్రయాణించడానికి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. లంకెలపాలెం పరవాడ,దేశపాత్రినిపాలెం, కలపాక వంటి గ్రామాల్లో తీవ్ర కాలుష్యంతో బొగ్గు లారీల నుండి వెదజల్లుతున్న ధూళితో ప్రజలు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని వెంటనే బొగ్గు లారీలను అధిక లోడ్లను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు.బొగ్గు లారీ కాంట్రాక్టర్లతో అధికారి యంత్రాంగం కుమ్మక్కైందని దీనివల్లనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ప్రమాదాలు అరికట్టడానికి నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని గనిశెట్టి ఆర్టీవో, పోలీస్ అధికారులను డిమాండ్ చేశారు.