సిరా న్యూస్,హైదరాబాద్;
మలక్ పేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులకు బకాయి వేతనాలు ఇవ్వాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
ఆసుపత్రిలో పేషంట్ కేర్, సిబ్బంది సెక్యూరిటీ గార్డ్,శానిటేషన్ కార్మికుల వేతనాలు చెల్లించాలని ఆసుపత్రి ముందు ఏఐటీయూసీ అనుబంధ సంఘం మెడికల్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నాలుగు నెలలుగా జీతాలు లేక కుటుంబం పస్థులు వుంటున్నామనిఇంటి కిరాయిలు కూడా కట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు.అధికారులకు ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాలు చెలించే వరకు విధులకు హాజరు కామని తెలిపారు.