సిరా న్యూస్,హైదరాబాద్;
హైదరాబాద్ అశోక్ నగర్ లోని నగర్ కేంద్ర గ్రంథాలయం వద్ద నిరుద్యోగ అభ్యర్థులు నిరసన ప్రదర్శనకు దిగారు. పలు విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోవడం లేదు.
ఎలక్షన్ ముందు బి.ఆర్.ఎస్ పార్టీ వైఖరికి మా విద్యార్థులము అందరమూ కలిసి వారిని అర్ధ పాతాళానికి తొక్కి కాంగ్రెస్ పార్టీ వస్తె మాకు న్యాయం చేస్తారని కష్టపడి మిమ్మల్ని గేలిపించుకున్నం ..ఇప్పుడు మీరు కూడా విద్యార్థులకు అన్యాయం చేస్ దిశ లో వెళ్తున్నారు … మా విద్యార్థులే లేకపోతే కాంగ్రెస్ పార్టీ గెలిచేదే కాదని అన్నారు.
మోతి లాల్ నాయక్ దీక్ష చేస్తుంటే ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గానీ ఎంపీ గానీ స్పందించలేదు.. దీక్ష చేస్తున్న సమయంలో నిన్న అర్ధ రాత్రి బల్మురి వెంకట్ వచ్చి రౌడీలతో విద్యార్థులను కొట్టారు. ఇది ఎంత వరకు కరెక్ట్ .. మా విద్యార్థుల వల్లే ప్రభుత్వం నీకు ఎమ్మెల్సీ పదవినీ కట్టబెట్టింది. అది గుర్తుపెట్టుకో ఖబడ్దార్. మెగా డీఎస్సీ గ్రూప్ 2000 గ్రూప్ 3000 పోస్టులు పెంచే వరకు తమ పోరాటం కొనసాగిస్తాం. ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నమే తప్ప గొంతెమ్మ కోరికలు కోరడం లేదని అన్నారు.
తెలంగాణ కోసం తమ ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధమయ్యామని తమకు న్యాయం చేయమని కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వము మెగా డీఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచు విడుదల చేయాలని కోరుతూ
గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్ట్లు పెంచే వరకు పోరాడుతాం. ఒక్క వేల మీరు మాకు న్యాయం చెయ్యలేక పోతే రాష్ట్రంలో ప్రతి ఒక్క లైబ్రరీ దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని హెచ్చరించారు.
============