PRTU Telangana: జోరుగా పీఆర్టీయూ తెలంగాణ సభ్యత్వ నమోదు 

సిరా న్యూస్, ఆదిలాబాద్‌:

జోరుగా పీఆర్టీయూ తెలంగాణ సభ్యత్వ నమోదు 

జిల్లాలో పీఆర్టీయూ తెలంగాణ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. మంగళవారం ఆదిలాబాద్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కుంటాల ఆశ్రమ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, నేరడిగోండ కేజీబీవీలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నూర్‌సింగ్, నర్ర నవీన్‌ యాదవ్, జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జాదవ్‌ ప్రకాశ్‌ తదితరులు పాఠశాలలను సందర్శించి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. 42 మంది ఉపాధ్యాయులు సభ్యత్వ నమోదు చేసుకున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గాల్‌ రెడ్డి హర్షవర్ధన్‌ రెడ్డి నాయకత్వంపై ఉపాధ్యాయులు పూర్తి నమ్మకంతో ఉన్నారని అన్నారు. దీంతోనే జిల్లాలో పెద్ద ఎత్తున ఉపాద్యాయులు సభ్యత్వ నమోదుకు స్వచ్చందంగా ముందుకు వస్తున్నారని అన్నారు. ఉపాధ్యా సమస్యలపై నిరంతరం పోరాటం చేసే పీఆర్టీయూ తెలంగాణకే ఉపాద్యాయులు మద్దతుగా నిలవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *