సిరాన్యూస్, ఉట్నూర్
ఐటీడీఏ డీడీటీడబ్ల్యూ ను కలిసిన పీఆర్టీయూటీజీ జిల్లా అధ్యక్షులు ఆడే నూర్ సింగ్
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ డీడీటీడబ్ల్యూ అధికారి దిలీప్ కుమార్ను పీఆర్టీయూటీజీ జిల్లా నాయకులు మంగళవారం వారి క్యాంపు కార్యాలయంలో కలిశారు.అనంతరం వారికి పుష్ప గుచ్ఛం అందజేసి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్బంగా పీఆర్టీయూటీజీ జిల్లా అధ్యక్షులు ఆడే నూర్ సింగ్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. ఉపాధ్యాయుల ఆన్లైన్ దరఖాస్తూ ను మరో రెండు రోజులు పొడగించాలని తెలిపారు. 317 జీఓ బదిలీ అయిన వారికి వారి పాత స్థానాన్ని చూపిస్తూ పాయింట్స్ కేటాయించాలని కోరారు. మ్యూచువల్ లో బదిలీ అయిన ఉపాధ్యాయులకు కూడా బదిలీలో అవకాశం కల్పించాలని తెలిపారు. పండిత్ తెలుగు, హిందీ , పీఈటీ పోస్టులను ఉన్నతీకరించాలని పై అధికారులకు విన్నవించాలని కోరారు. ఆన్లైన్ అప్లై తేదీ ని పొడగించాలని కోరారు. దీనికి వారు సాను కూలంగా స్వప్నదించారు. ఈకార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నర్ర నవీన్ యాదవ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జాదవ్ ప్రకాష్, దినేష్, బాబు సింగ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.