సిరాన్యూస్,ఆదిలాబాద్
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి : పీఆర్టీయూటీజీ అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పీఆర్టీయూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా కు కృతజ్ఞతల సభకు వచ్చిన పీఆర్టీయూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డిని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్వ సత్యనారాయణని స్వాగతిస్తూ, సన్మానించారు. అనంతరం స్థానిక బీసీ సంఘ భవనంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత10 సంవత్సరాలుగా ఉపాధ్యాయుల నిలిచిపోయిన పదోన్నతులు, బదిలీలు ఈ ప్రభుత్వం నిర్వహించి రాష్టం లోని దాదాపు 20 వేలకు పైగా ఉపాధ్యాయులకు పదోన్నతి, బదిలీలు కల్పించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నఉపాధ్యాయ సమస్యల వినతి పత్రాలు స్వీకరించారు. దీనికి హర్షవర్ధన్ రెడ్డి సానుకూలంగా స్పందించి ప్రతి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి ఆడే నూర్ సింగ్, నర్ర నవీన్ యాదవ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జాదవ్ ప్రకాష్, మోహన్ సింగ్, రాజు, బాబన్న, ముజీబ్, సంతోష్, సునీల్, దినేష్, పీఆర్టీయూ టీజీ జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.