సిరాన్యూస్, ఆదిలాబాద్
షోకాజు నోటీసుల నుంచి పేర్లను తొలగించాలని అడిషనల్ కలెక్టర్కు వినతి
పీఆర్టీయూ తెలంగాణ జిల్లా శాఖ నాయకులు
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో ఉద్యోగులు ఎన్నికల విధులు నిర్వహించినప్పటికీ ఎన్నికల అధికారుల నుండి షోకాజు నోటీసులు జారీ చేశారని పీఆర్టీయూ తెలంగాణ జిల్లా శాఖ నాయకులు అన్నారు.శనివారం ఆదిలాబాద్ అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవికి వినతి పత్రం అందజేశారు. ఎన్నికల విధులు నిర్వహించిన వారి పేర్లు షోకాజు నోటీసుల నుంచి తొలగించాలని కోరారు.