సిరా న్యూస్,మేడ్చల్;
మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండల గ్రామ పంచాయతీ వద్ద కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ప్రజా పాలనా కార్యక్రమం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.ఈ ప్రజాపాలన కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు మేడ్చల్ నియోజకవర్గం కాంటెస్టెడ్ ఎంమ్మెల్యే తోటకూర వజ్రష్యాదవ్,మాలిపేద్దిసుదీర్రెడ్డి,మాలిపేద్ది శరత్ చంద్ర రెడ్డి పర్యవేక్షించారు.అనంతరం గ్రామ పంచాయతీ లోనికి వెళ్తూన వజ్రెష్ యాదవ్ ప్రజాపాలన కేంద్రం పక్కన నిలబడి ఉన్న బిఆర్ఎస్ పార్టీ నాయకులను కలిసి శామీర్ పేట బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుదర్శన్ ను బుజంపై చేయి వేసి ని పెళ్లి చెప్తా అనుకుంటూ లోపలికి వెళ్లారు కాంగ్రెస్ నాయకులు.ఆమాటతో ఒక్కసారిగా బిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.న పెళ్లి చేస్తా అన్నావ్ కదా ఆలా చేస్తావో చూపించమని ఇరువురి మధ్య తోపులట జరిగింది.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కాంగ్రెస్ నాయకులను అక్కడినుండి పంపించి గొడవను సద్దుమానిగేలా చేశారు.