-మంథనిలో నిర్వహించే ప్రజావాణి కి హాజరుకానున్న జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
సిరా న్యూస్,మంథని;
ఫిబ్రవరి 19న సోమవారం జిల్లా కలెక్టరేట్ తో పాటు మంథని తహసిల్దార్ కార్యాలయంలో రెండు చోట్ల ఉదయం 10-30 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ గురువారం తెలిపారు.
మంథని డివిజన్ సంబంధించి మంథని తహసిల్దార్ కార్యాలయంలో నిర్వహించు ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జిల్లా కేంద్రంలో నిర్వహించు ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు పాల్గొంటారని తెలిపారు.
జిల్లా కేంద్రంలో, మంథని డివిజన్ కేంద్రంలో నిర్వహించు ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలు తెలుపుతూ అర్జీలను సమర్పించవచ్చు అని జిల్లా కలెక్టర్ తెలిపారు.జిల్లా అధికారులు కలెక్టరేట్ లో నిర్వహించు ప్రజావాణి కార్యక్రమంలో, మంథని డివిజన్ అధికారులు డివిజన్ కేంద్రంలోని మంథని తహసిల్దార్ కార్యాలయంలో నిర్వహించు ప్రజావాణి కార్యక్రమంలో ఉదయం 10 గంటల నుండి అందుబాటులో ఉండే విధంగా సకాలంలో హాజరు కావాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.