Pullaiah: విత్తన విక్రయాలలో అక్రమాలకు పాల్పడితే చర్యలు:  జిల్లా వ్యవసాయ అధికారి డి పుల్ల‌య్య 

సిరాన్యూస్, బోథ్‌
విత్తన విక్రయాలలో అక్రమాలకు పాల్పడితే చర్యలు: జిల్లా వ్యవసాయ అధికారి డి పుల్ల‌య్య
* విత్త‌నాల దుకాణాలు త‌నిఖీ

విత్తన విక్రయాలలో అక్రమాలకు పాల్పడితే చర్యలు త‌ప్ప‌వ‌ని జిల్లా వ్యవసాయ అధికారి డి పుల్ల‌య్య అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని విత్తన దుకాణాలను శనివారం జిల్లా వ్యవసాయ అధికారి డి పుల్లయ్య తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విత్తన విక్ర‌యాల‌లో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చ‌రించారు. ప్రభుత్వం విధించిన ధరలకంటే అధికంగా విక్రయించవద్దని సూచించారు. స్థానిక రైతులకు విత్తనాలను విక్రయించాలన్నారు. ఆయన వెంట ఏడీఏ శ్రీధర్, స్వామి, మండల వ్యవసాయ అధికారి రమేష్ కుమార్, ఈవోలు శ్యాంసుందర్ రెడ్డి, సంతోష్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *