సిరాన్యూస్,జైనథ్
భోరజ్ భారత్ పెట్రోలియం పెట్రోల్ బంక్లో కిసాన్ మేళా : పంప్ ఆపరేటర్ రాసం నవీన్
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం భోరజ్ భారత్ పెట్రోలియం పెట్రోల్ బంక్ లో సోమవారం కిసాన్ మేళా నిర్వహించారు. ఈసందర్బంగా పంప్ ఆపరేటర్ రాసం నవీన్ మాట్లాడుతూ ఘర్ ఉత్సవ్ లో భాగంగా పెట్రోల్ బంక్ లో కిసాన్ మేళా నిర్వహించామన్నారు వివిధ సీడ్స్ కంపెనీ అధికారులు హాజరయ్యారని తెలిపారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి రైతులు పెద్దసంఖ్యలో హాజరయ్యారన్నారు కిసాన్ మేళాలో రైతులకు వివిధ సీడ్స్ కంపెనీ వారుపత్తి,సోయా,కంది,మిరప, కూరగాయల సాగు,వాటికి వచ్చే వ్యాధులు, నివారణ చర్యలు, వాడాల్సి మందులు,అధిక దిగుబడి సాదించే విధానాల గురించి అవగాహన కల్పించినట్లు తెలిపారు. కిసాన్ మేళా కు వచ్చి అవగాహన కల్పించిన సీడ్స్ కంపెనీ వారికి పెట్రోల్ పంప్ ఆపరేటర్ రాసం నవీన్ ధన్యవాదాలు తెలిపారు.